ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజాకర్ల పాలనకు మద్దతిచ్చినట్లేనా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 01:35 PM

విమోచన దినోత్సవ కార్యక్రమం జరుపకుండా ప్రజాపాలన పేరుతో వేడుకలు నిర్వహించడం రజాకర్ల అకృత్య పాలనకు మద్దతిచ్చినట్లేనా..? అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రామాలయంలో మోదీ పేరిట పూజారులచే అర్చన నిర్వహించారు. జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రేపు కరీంనగర్ జిల్లాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామం లో మొక్కలు నాటారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కోరారు. 88000 02024 నంబర్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతీ బూత్ లో 200 పైగా సభ్యత్వాలను చేయించి బీజేపీ ని బలపర్చాలన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు కావని అందుకే మోసపూరిత పాలనకు కాంగ్రెస్ నిర్వచనమన్నారు. రుణమాఫీ అంటూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రేషన్ కార్డులు రేపు మాపంటూ కాలం వెళ్ళదీస్తున్నారని ఆరోపించారు. ఇలా మోస పూరిత లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, సభ్యత్వ నమోదు సహా ప్రముఖ్ గడ్డం అరుణ్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కానుగంటి మధుకర్ రెడ్డి, వేల్పుల ఓదయ్య, ఎడ్ల భూంరెడ్డి, బూత్ అధ్యక్షుడు సుద్దాల సతీష్, బండి స్వామి, గడ్డం లక్ష్మణ్, మారం శివ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa