వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను రాడార్ స్టేషన్ కోసం భారత నావికాదళానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఈరోజు సేవ్ దామగుండం పేరిట హైదరాబాదులో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగిన నిరసనలో ప్రొఫెసర్ మరియు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారితో కలిసి మద్దతు తెలిపిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవడం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవడం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగడం వంటి సమస్యలు ఏర్పడుతాయాని గ్రహించిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి ప్రభుత్వం 3000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి 10 సంవత్సరాలు నిరాకరించిందని గుర్తు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa