ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2024, 08:30 PM

విజ్ఞాన్‌పూరి కాలనీలో రోడ్డు పనులను  వేగవంతం చేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. గురువారం కాలనీలో నూతనంగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కాలనీలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా పూర్తిచేయాలని, రోడ్డు పనులలో నాణ్యతాప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణ, ఈఈ గోవర్ధన్‌, స్థానిక నేతలు సంతోష్‌, ప్రభాకర్‌, కాలనీ వాసులు ఉన్నారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa