ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు..? రేవంత్ సర్కార్ కీలక అప్డేట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:19 PM

శ్రీకాకుళం జిల్లాలో పురాతన విగ్రహాలను గుర్తించారు. సారవకోట మండలం అంగూరు కుంభేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చెరువు ఉంది. అయితే రెండేళ్ల క్రితం తవ్వకాలు చేపట్టగా.. అక్కడ పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. అయితే ఆ విగ్రహాలు క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటివని, తూర్పు గాంగుల కాలానికి చెందినవిగా పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి తెలిపారు. ఒకే చోట ఉన్న రెండు విగ్రహాల్లో ఒకటి బ్రహ్మ, రెండోది సరస్వతీదేవి విగ్రహమని గుర్తించినట్లు ఆయన చెప్పారు. అప్పట్లో ఈ విగ్రహాల చెవులు, ముక్కుకు వజ్రాలు పొదిగి ఉండేవి అన్నారు. అయితే దొంగలు విగ్రహాలకు ఉన్న చెవులు తొలగించి వజ్రాలు ఎత్తుకెళ్లినట్లు పురావస్తు పరిశోధకులు గుర్తించారని అంగూరులో స్థానికులు చెబుతున్నారు. ఈ విగ్రహాలను భద్రపరిచి భావితరాలకు అందిస్తామంటున్నారు. ఈ పురాతన విగ్రహాలను చూసేందుకు చుట్టుపక్కల జనాలు తరలివస్తున్నారు.


దసరా ప్రత్యేక రైలు


దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి విజయవాడ- శ్రీకాకుళం రోడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు (07215) ఈ నెల 10, 11, 12, 14, 15, 16, 17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కి శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.


ఈ రైలు (07216) తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్‌లో ఉదయం 6.30కి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ వెళుతుంది. ఈ ప్రత్యేక రైలు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతేకాదు దసరా రద్దీ పెరగడంతో మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa