నగర శివారు హయత్నగర్లోని జడ్పీ హైస్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం స్కూల్ గేటు విరిగిపడి అజయ్ అనే బాలుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం స్కూల్ వద్ద విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో అజయ్ ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఇంటికి వచ్చే క్రమంలో గేటు విరిగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే సోమవారం పిల్లలందరితో కలిసి అజయ్ వెళ్లాడు. సాయంత్రం 3.45 గంటలకు తరగతి గదిలోంచి బయటకు వచ్చాడు. అప్పటికే కొందరు విద్యార్థులు మెయిన్ గేటు ఎక్కి ఊగుతున్నారు. వారు దిగి వెళ్లిపోగా బాలుడు ఎక్కి ఊగుతుండగా తుప్పుపట్టిన అది ఒక్కసారిగా విరిగిపోయి మీదపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న ఓ విద్యార్థినికి స్వల్ప గాయమైంది. ఉపాధ్యాయులు బాలుడిని ఆటోలో తొలుత స్థానిక ఆస్పత్రికి, తర్వాత వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇంటికి రావాల్సిన కుమారుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa