తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ లేదని చెప్పారు. నవంబర్ 11వ తేదీ వరకు కూడా తెలంగాణలో పొడి వాతారవణమే ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉందని అంచాన వేశారు.
అయితే నవంబర్11 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత మూడ్రోజులు మాత్రం రాష్ట్రానికి ఎటువంటి వర్ష సూచన లేదని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయని అన్నారు. పలు జిల్లాల్లో కనిష్ఠ స్థాయిలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వెల్లడించారు. పగలు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగానే ఉంటున్నా.. సాయంత్రం, రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో 18 డిగ్రీల కనిష్ఠానికి పడిపోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక నైరుతి బంగాళాఖాతంలో కొనసాగతున్న ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలోలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరో 48 గంటల్లో ఆవర్తనం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీలో రెండు మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు కూడా వీస్తున్నాయని చెప్పారు. ఉత్తర కోస్తా, యానాంలలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయన్నారు. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa