ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి : సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 06:59 PM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని బీఆర్ఎస్ అసత్యపు ప్రచారం చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు వరిసాగు పెరగటంతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


'కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చింది. కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా.. ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.' అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.


రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ ఇక తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో వరికి బోనస్ డబ్బులు జమ చేస్తుంది. సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఓ అన్నదాత ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున 60 క్వింటాళ్లకు మెుత్తం రూ.30 వేలు జమ చేశారు. శనివారం (నవంబర్ 16) సుమారు రూ.కోటి పైగా బోనస్ చెక్కులపై తెలంగాణ సివిల్ సప్లయ్ శాఖ సంతకాలు చేసింది. రానున్న 48 గంటల్లో అన్నదాతల ఖాతాల్లోకి వరికి రూ.500 బోనస్ డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు మెుదలు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa