ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఎరుపెక్కిన రోడ్డు.. రక్తాన్ని తలపించేలా, అసలు విషయం ఇదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 07:02 PM

హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో సోమవారం సాయంత్రం రోడ్డు ఎరుపెక్కింది. హత్యలు, యాక్సిడెంట్లు జరిగితే ఏరులై పారిన రక్తం మాదిరిగా.. మ్యాన్‌హోల్‌ నుంచి ఎరుపు రంగు నీరు స్థానికులను టెన్షన్‌కు గురి చేసింది. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తుండంతో వాటి ద్వారా మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa