బడుగులకు విద్య నేర్పిన ఆశాజ్యోతిఅణగారిన వర్గాల అక్షర దీపం మహాత్మా జ్యోతి బాపూలే అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ భారతదేశం మనువాద చీకటి రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు వెలుగుల బాటలు వేసిన గొప్ప సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే, ఈ దేశంలో బ్రాహ్మణ మనుస్మృతి స్త్రీలను దళితులను బహుజనులను బానిసలుగా చేసి, అక్షరానికి, ఆస్తికి, అనేక వివక్షలకు గురి చేసిన మనువాద మనుస్మృతిపై తిరుగుబాటు చేసి గెలిచిన గొప్ప త్యాగ శీలుడు, పకృతిలో సగమైన స్త్రీని బానిసగా చేసిన బ్రాహ్మణ బానిసత్వం నుండి విముక్తి కై ఈ దేశంలో స్త్రీకి మొదటగా చదువు నేర్పాలని అది తన ఇంటి నుండే ప్రారంభం.
కావాలని మొదటగా తన సతి అయిన అమ్మ సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి ఆమె ద్వారా భారత సమాజంలోని చీకటి గృహ నిర్బంధంలో ఉన్నటువంటి అన్ని వర్గాల స్త్రీలకు చదువు నేర్పి, బ్రాహ్మణ వర్గాల నుండి అనేక ఇబ్బందులు ఎదురైనా వారు ఎంచుకున్న మార్గాన్ని చేరుకున్నారని అన్నారు. ఈ దేశ మనవాద గోడలను కూల్చి నూతన సమాజానికి పునాదులు వేసిన మహాత్మ పూలే గారిని, అమ్మ సావిత్రి గారిని ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోదాని తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం చైతన్యం వైపు నడిపిన పూలే దంపతుల మార్గాన్ని ఈ దేశ దళిత బహుజనులు ఇప్పటికీ చేరుకోలేకపోయారని అన్నారు నూటికి 50% ఉన్నటువంటి బహుజనులు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కొరకు పోరాటం చేయవలసి ఉంది, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు చూపిన మార్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి బహుజనుల అన్ని రకాల పోరాటాలకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బండా శ్రీశైలం నాంపల్లి చంద్రమౌళి ఎర్పుల యాదయ్య సాలూవోజు రామలింగాచారీ రాధాకృష్ణ మాజీ సర్పంచ్ ముత్యాలు యస్ కృష్ణయ్య కె అంజయ్య లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa