మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని దామరవంచలో గల, టి జి టి డబ్ల్యూ యు ఆర్ జె సి. బాలుర గురుకులంలో అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో, ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మురళీధర్ హాజరై సందర్శించారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుద్ధ గురించి వారు చూసినవి చేశారు. ఈ వైద్య శిబిరంలో 430 మంది పిల్లలకు గాను, 74 మంది పిల్లలకు వాతావరణ మార్పుల వల్ల వచ్చే జబ్బులు దగ్గు, జలుబు, దురదలు వంటి, చిన్న చిన్న జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇచ్చారు. ఇందులో ఇద్దరు జ్వర పిడుతులను గుర్తించి, గుర్తించి మలేరియా, డెంగి పరీక్షలు నిర్వహించి రక్తనమునాలు సేకరించారు. క్యాంపు అనంతరం డాక్టర్ బి. యమున మాట్లాడుతూ, పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించి, ఉతికి ఎండలో ఆరేసిన బట్టలను మాత్రమే ధరించాలి.
లేనిచో పిల్లలకు దురద వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. వేడి వేడి ఉడికిన ఆహారం మాత్రజమే తినాలని తెలియజేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మురళీధర్, డాక్టర్ యమున తో పాటుగా, ఉమ్మడి గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలోని కిచెన్ డార్మెంటరీ, బాత్రూం, కళాశాల పరిసరాలను పరిశీలించి, తగు ఆరోగ్య సూచనలు సూచించారు. ఇట్టి వైద్య శిబిరం కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, సిసి. రామకృష్ణ, సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డబోయిన శ్రీనివాసు, ఆర్ బి ఎస్ కె. డాక్టర్ శ్రీమన్నారాయణ, హెచ్ ఇ ఓ. లోక్యా నాయక్, హెచ్ ఎస్. గణేష్, హెల్త్ అసిస్టెంట్ సర్దార్ బాబు, ఎం ఎల్ హెచ్ పి. హిమాకర్, ఏ ఎన్ ఎం. సరోజన, భవాని, ఆశా వర్కర్ లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa