డిసెంబర్ 9న విజయ్ దివస్ సందర్భముగా పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లినీ పాలతో పాలాభిషేకం చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతోమాట్లాతూ.తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి కొడలి వద్ద టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం.
అనంతరం పూలమాలవేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనో భావాలను దెబ్బ తీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ కు దక్కిందని ఎదవ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని హెచ్చరించారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కృషి చేయాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్లు నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa