ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 03:44 PM

రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నగరంలో స్థానికంగా గల హార్వెస్ట్ పాఠశాలలో లక్ష్మీ నక్షత్ర (13) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతుంది.లక్ష్మీ నక్షత్ర వయస్సు సోమవారం రోజు ఖమ్మం లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి వద్ద తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని విద్యార్థిని బంధువులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa