ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జానీ మాస్టర్ జైలుకు వెళ్లటంలో అల్లు అర్జున్ కుట్ర.. అందుకే ఉసురు తగిలింది: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 07:00 PM

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావటం దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. తొక్కిసలాటలో మహిళ చనిపోవటానికి అల్లు అర్జున్ కూడా కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా.. ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. కొందరు ప్రభుత్వ చర్యను సమర్థిస్తుండగా.. మరికొందరు కక్షపూరితం అంటూ వ్యతిరేకిస్తున్నారు.


ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లటంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని.. ఆ ఉసురు తగిలే ఇప్పుడి జైలుకు వెళ్లాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన మల్లన్న.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును ప్రకటించటం పట్ల అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయాడని అన్నారు. నేషనల్ అవార్డు తనకొక్కడికే ఉండాలని కుట్రపూరితంగా ఓ అమ్మాయితో కేసులు పెట్టించి జైలుకు పంపినట్లు ఆరోపించారు. జానీ మాస్టర్‌కు బెయిల్ కూడా రాకుండా సుప్రీం కోర్టు దాకా వెళ్లి కేసులు పెట్టినట్లు చెప్పారు.


జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా కూడా నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని లేఖ కూడా రాశారని ఆరోపించారు. మరి ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డుని వెనక్కి ఇస్తాడా? అని మల్లన్న ప్రశ్నించాడు. పుష్ప సినిమా ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారో చెప్పాలన్నారు. ఎర్ర చందనం దొంగతనం చేస్తే నేషనల్ అవార్డ్ ప్రకటిస్తారా..? జానీ మాస్టర్ ఉసురు తగలటం వల్లే ఒక రాత్రంతా అల్లు అర్జున్ జైలులో ఉన్నాడని... అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని మల్లన్న ఘాటు కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న తీన్మార్ మల్లన్న.. పుష్ప సినిమా దెబ్బకు తాను సినిమాలు చూడటం మానేసినట్లు చెప్పారు. ఎర్ర చందనం దొంగతనం చేయటం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. తాజాగా.. మరోసారి అల్లు అర్జున్ అరెస్టు‍పై కామెంట్స్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇదిలా ఉండగా.. జైలు నుంచి ఈ ఉదయం విడుదలైన అల్లు అర్జున్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం కేసు నడుస్తున్నందున తానేమీ మాట్లాడలేనని అన్నారు. సంధ్య థియేటర్ ఘటన అత్యంత దురదుష్టకరమని.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ మరోసారి హామీ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్‌ను కలిసేందుకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. పుష్ప టీంతో పాటు అగ్ర నిర్మాతలు, డెరెక్టర్లు ఆయన్ను పరామర్శిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa