వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్ ఛార్జర్ ఓ బాలుడి ప్రాణం తీసింది. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ కొట్టి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేష్ (16) స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే శనివారం (డిసెంబర్ 14) ఉదయం నిద్రలేచిన రాకేష్.. తన సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు.
ఎలక్ట్రిక్ బోర్డు సాకెట్లో ఛార్జర్ పెట్టిన రాకేష్.. ఆ తర్వాత కేబుల్ను తన సెల్ఫోన్కు కనెక్ట్ చేసే సమయంలో కరెంట్ షాక్కు గురయ్యాడు. ఆక్కసారిగి విద్యుత్ సరఫరా కావటంతో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్లగ్ నుంచి కరెంట్ తీసేసి రాకేష్ను పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. సెల్ఫోన్లు పేలిపోవటం, షార్ట్ సర్క్యూట్ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు అయాన్లు ఒకే దిశలో ప్రవహిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఛార్జింగ్ ప్లగ్ తీసేయగానే అవి విద్యుత్ను రెండు వైపులా ప్రసారం చేస్తాయిని అంటున్నారు. క్విక్ ఛార్జింగ్ పద్ధతుల్లో బ్యాటరీని ఛార్జి చేసేటప్పుడు అధిక వేడి ఉత్పత్తి అయి ఆనోడ్పై లిథియం పేరుకుపోతుందని అంటన్నారు. దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. బ్యాటరీలను ఒక నిర్దిష్ట ఓల్టేజి విద్యుత్తో ఛార్జ్ చేసేలా తయారు చేస్తారని.. వేగంగా చార్జ్ చేసేందుకు ప్రయత్నిస్తే కూడా ప్రమాదాలకు అవకాశం ఉంటుందంటున్నారు.
సెల్ఫోన్ ఛార్జ్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
కంపెనీకి చెందిన ఒరిజనల్ ఛార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి.
ఛార్జింగ్లో ఉండగా కాల్స్ మాట్లాడటం, అలాగే గేమ్స్ ఆడటం చేయరాదు.
ఛార్జింగ్ పూర్తయిన తరువాత ప్లగ్ నుంచి తొలగించాలి.
ఛార్జింగ్ సమయంలో ఫోన్కి ఉండే కేస్ తొలగించడం మంచిది.
ఫోన్ బాగావేడిగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపేయాలి.
ఫోన్లను మంటల వద్ద, గ్యాస్ స్టవ్ల వద్ద, వేడి హీటర్ల వద్ద ఉంచి ఛార్జ్ చేయరాదు.
ఫోన్ నీళ్లలో పడిపోతే వెంటనే ఛార్జింగ్ పెట్టకుండా తేమ పూర్తిగా పోయాకే ఛార్జింగ్ పెట్టాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa