ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన 619 మంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 01:50 PM

మద్యం సేవించి వాహనాలను నడిపినందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 619 మంది కొత్త సంవత్సరంలో కోర్టు మెట్లు ఎక్కనున్నారు. 21 - 30 సంవత్సరాల వయస్సు గల 262 మంది ట్రాఫిక్ రూల్స్ ను పాటించలేదని సమాచారం.619 వాహనాలల్లో 526 ద్విచక్ర వాహనాదారులే ఉన్నారు. 64 మంది కారులను స్వాధీనం చేసుకుని మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేరే ఏర్పాట్లను పోలీస్ లు చేశారు.ఈ మందుబాబులు తనిఖీల్లో అత్యధికంగా బీఏసి ( బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ ) 339 వరకు వచ్చింది. కోర్టు తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపి మొదటి సారి పట్టు బడిన మందుబాబుకు రూ. 10 వేలు ఫైన్ , లేదా 6 నెలలు, 3 నెలలు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. రెండో సారి దొరికిన వారికి రూ. 15 వేలు ఫైన్, 2 ఏండ్లు జైలు ఖాయం అంటున్నారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. ట్రక్, లారీ డ్రైవర్ లు కూడా మద్యం సేవించి వాహనాలను నడపడం కొంత కలవరానికి గురి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa