జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ భరోసానిచ్చారు. తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, ఆదివారం జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ దూసేటి మహేందర్ రెడ్డి కాలం చేయగా, ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి.. నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. గతంలో కొన్ని పత్రికలు విలేకరులకు ఎంతో కొంత వేతనం ఇచ్చేవనీ, ప్రస్తుతం అవి కూడా ఏ పత్రికల యాజమాన్యాలు ఇవ్వడం లేదన్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ కమిటీల్లో ఇంటి నిర్మాణాలకు నిధులు సైతం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్ (సాక్షి), ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్ (టీవీ5, శ్వేతన్యూస్), ఉపాధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు (హెచ్ఎంటీవీ, మైత్రి), ఎండీ రహీం (బిగ్ టీవీ), గౌరవ అధ్యక్షుడు ముస్కు లక్ష్మారెడ్డి(మహాన్యూస్), జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్(ప్రైమ్ 9), సలహా దారు వేల్పుల రాజు(నమస్తే తెలంగాణ), కోశాధికారి ఆంజనేయులు (నవ తెలంగాణ), సంయుక్త కార్యదర్శి కొంపల్లి సతీష్ (ఎన్టీవీ), బూమాడి శ్రీధర్ రెడ్డి (నమస్తే తెలంగాణ రూరల్), ప్రచార కార్యదర్శి జాప నాగరాజు (చురుకలు), లీగల్ అడ్వైజర్ మాతంగి రవి (దిశ), కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్ (టీ న్యూస్), విష్ణు (ఆంధ్రప్రభ), విజయ్ కుమార్ (మన తెలంగాణ), రాజిరెడ్డి (99టీవీ)ని ఎమ్మెల్యేతో పాటు పలువురు మండల నాయకులు శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa