ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు. ఇదే నిజం ఓదెల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 02:28 PM

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తన తో మెలగాలి..నేర ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు..పోత్కపల్లి ఎస్సై .దీకొండ రమేష్., పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్‌, సస్పెక్ట్‌ షీటర్స్‌కు   పోత్కపల్లి ఎస్సై .దీకొండ రమేష్  పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై .దీకొండ రమేష్ మాట్లాడుతూ. వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు.
శాంతి భద్రతలకు , ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై  దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని  బైన్డోవర్ చేయడం వలన వారిపై  పోలీస్ నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు ,ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకొవడం జరుగుతుంది. బైండొవర్ కాలంలో ఏదైనా నేరం కు పాల్పడినట్లు అయితే జరిమానా తో పాటు గా జైలు శిక్ష కూడా పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సత్పవర్తనతో మెలగాలి, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల చాలా కఠినంగా  వ్యవహరిస్తామని, సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa