ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఇండ్లు లేనివారికి 'స్పెషల్' గుడ్‌న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక అప్డేట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 07:38 PM

తెలంగాణలో ఇండ్లులేని నిరుపేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపికబురు వినిపించింది. ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రెండు దశల్లో ఇండ్ల పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మొదటగా మాత్రం స్థలాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేయనున్నట్టు ప్రకటించింది. రెండో దశలో మాత్రం ఇండ్ల స్థలంతో పాటు ఇండ్ల కూడా నిర్మించి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సర్కార్ కసరత్తు కూడా చేస్తోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేపట్టగా.. దాదాపు 95 శాతం పూర్తయింది. త్వరలోనే ఇదిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చారు.


ఇందిరమ్మ ల‌బ్దిదారుల‌ ఎంపిక విషయంలో పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఫిర్యాదుల కోసం ఇందిర‌మ్మ ఇండ్ల గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల ఎంపిక‌లో ఏమైనా స‌మ‌స్యలు ఎదురైతే వెంటనే.. indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఎప్పటిక‌ప్పుడు తీసుకున్న చ‌ర్యల వివ‌రాలు ఫిర్యాదుదారుని మొబైల్‌కు మెసేజ్ ద్వారా తెలిజేస్తారని మంత్రి తెలిపారు.


గ్రామాల్లో ఎంపీడీవో, ప‌ట్టణాల్లో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ద్వారా సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు వెళ్తుందని.. వాళ్లు వెంటనే ఆ ఫిర్యాదుపై దృష్టి సారిస్తారమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకానికి త‌మ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎలాంటి మ‌ధ్యవ‌ర్తుల‌కు చోటివ్వకుండా.. అర్హులైన వారికే ఇండ్లు మంజూర‌య్యేలా పార‌ద‌ర్శకంగా చ‌ర్యలు తీసుకుంటుందన్నారు. వీలైనంత త్వరిత‌గ‌తిన‌ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇప్పటికే ఇందిర‌మ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న ఈనెల 8వ తేదీ నాటికి హైద‌రాబాద్ మిన‌హా 32 జిల్లాల‌లో 95 శాతం పూర్తికాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 88 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. త్వర‌లోనే ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారించాల‌ని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులు సూచించారు. అర్హులైన ల‌బ్దిదారుల‌కే ఇండ్లు అందేలా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు.


మొద‌టి విడ‌త‌లో నివాస‌ స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామ‌ని.. రెండో ద‌శలో ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుంద‌ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. మొద‌టి విడ‌త‌లో విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, అనాధలు, వితంతువులు, ట్రాన్స్ జెండ‌ర్లు, స‌ఫాయి కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని అధికారుల‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa