బీసీ ఆజాది సైకిల్ యాత్ర కన్వీనర్ బత్తుల సిద్దేశ్వరులు సైకిల్ యాత్ర ఎనిమిదవ రోజు నర్సంపేట లో అసెంబ్లీ టైగర్ స్వర్గీయ మాజీ యం ల్ ఏ మద్దికాయల ఓంకార్ ఉద్యమం స్పూర్తితో పోరాటాల గడ్డనుండి అణగారిన వర్గాలు తరలిరావాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే పల్లెలకు గెలిచినప్పుడు పార్లమెంటును గెలుస్తామని ప్రజలకు పిలుపునివ్వడం జరిగినది, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే మాట్లాడుతూ ఫిబ్రవరి 2 ఆదివారం ఆర్ట్స్ కాలేజీ హనుమకొండ ఆచార్య జయశంకర్ ప్రాంగణంలో ఓరుగల్లు బీసీ రాజ్యాధికార యుద్ధబేరి మహా గర్జన వారి బహిరంగ సభ కు పల్లె పల్లె గడపగడప నుండి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీల ఆత్మగౌరవమైన రాజ్యాధికార దిశగా బీసీలు బీసీల కోసం యుద్ధం చేసి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే బీసీలకు నిజమైన ఆత్మ గౌరవం అని గడప గడ ప నుండి ప్రతి బీసీ మేధావులు యువకులు విద్యావంతులు మహిళలు సభను విజయవంతం చేయాలని కోరారు.
బీసీ అజాది సైకిల్ యాత్రకు స్థానిక మాజీ MPP నల్లమనోహర్ రెడ్డి, కౌన్సిలర్ నాగిశెట్టి ప్రసాద్ పటేల్, బూడిద ముకేశ్ యాదవ్, చాడ శ్రీమత రెడ్డి గార్లు జెండా ఊపి ప్రారంభించారు సైకిల్ యాత్రలో హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్ పటేల్, ఆజాది అంబేద్కర్ సంఘం కొంగర నరహరి, మాదిగ దండోరా రాష్ట్ర నాయకులు కుంటి విజయ్ కుమార్,బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కోట్ల వాసుదేవ్,పెద్దపల్లి తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు గుండవేణ స్వామి,గుంటుక నవ్య, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, కళాకారులు బృందం గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa