ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ బడులలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం....

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 06:32 PM

ప్రభుత్వ బడులలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం అని ఎల్ఐసి హౌసింగ్   ఫైనాన్స్  హైదరాబాద్ లో రికవరీ  మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న  రణపంగు ప్రవీణ్ కుమార్, సహోదరుడు రణపంగు నవీన్ కుమార్ లు ఆదివారం అన్నారు.76 వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా  పట్టణంలోని అంబేద్కర్ కాలనీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, గైడ్స్ ,పరీక్షా సామాగ్రి అందించి వారిని అభినందించి మాట్లాడారు.
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. పరీక్షల్లో మంచి మార్కులు తీసుకువచ్చి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ ని ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బెజవాడ శ్రావణ్, ప్రధానో పాధ్యాయులు కృష్ణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com