ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూనియర్ న్యాయవాదులు ప్రతిరోజు కోర్టుకు రావాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2025, 06:36 PM

జూనియర్ న్యాయవాదులు ప్రతిరోజూ కోర్టుకు రావాలని, ప్రాక్టీస్ ద్వారా తమ పనితీరు మెరుగు పరచుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  న్యాయవాదులకు బహుమతులను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు క్రమశిక్షణతో మెలిగి వృత్తికి గౌరవాన్ని తీసుకురావాలని సూచించారు. న్యాయవాదులు హక్కులతో పాటు బాధ్యతను సైతం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అరుణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షులు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఏజిపి హఫీజ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com