పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలు అభినందనీయులని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు అన్నారు. మండలంలోని అంతారం గ్రామ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజీమేరి, రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులు భారత్ మాతాకీ జై అమరవీరులకు జోహార్లు వంటి నినాదాలు చేశారు. ఈ వేడుకలో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలకు హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులు ఆర్ అంజయ్య గౌడ్, విశ్రాంత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ యన్ అంజన్ గౌడ్, యువ నాయకులు కావాలి వెంకటేష్ బాబు పాఠశాల అభివృద్ధికి తమ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాల అభివృద్ధికి దాతలు తమ సహకారాలు అందిస్తామని ప్రకటించడం పట్ల ఉపాధ్యాయులు వారికి అభినందనలు తెలుపుతూ శాలువాలతో సన్మానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీలో, వివిధ కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామంలో అంబేద్కర్, శివాజీ యువజన సంఘాల అధ్యక్షులు మణికంఠ, పాండు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa