నిరుపేదలకే సంక్షేమ పథకాలను అందిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం గుడెపాడు జాతీయ రోడ్డు దగ్గర నుండి ఆత్మకూర్ మండలం గూడెపాడు గ్రామపంచాయతీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే దేవుడి ప్రకాశ్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ చైర్పర్సన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, పరకాల ఆర్డిఓ నారాయణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు అందవలసిన ముఖ్యమంత్రి సహాయ నిధుల నుండి దోచుకున్న దొంగలు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి అని అన్నారు. పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్ రూములు ఇవ్వని వీళ్లు విమర్శలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చేస్తున్న అభివృద్ధి కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ గృహాలను, వితంతువులు పింఛను, ఉద్యోగ పింఛన్లు కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. 13 నెలల్లోనే ఉచిత విద్యుత్, ఉచిత బస్సుతోపాటు, 500 రూపాయలకే గ్యాస్ పథకాన్ని అందిస్తున్నామన్నారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా చెయ్యలేని పనులను 13 నెలలు చేసి చూపించామన్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరన్నారు. మీ అందరి ఆధార అభిమానాలతో శక్తివంచని లేకుండా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa