ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ భవిష్యత్తు యువత నడవడికపై ఆధారపడి ఉంటుంది:కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 02:53 PM

యువత చెడు వ్యసనాలు, చెడు అలవాట్లకు లోనై వారి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అన్నారు. అనంతగిరి మండల పరిధిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల వారి కుటుంబం వీధిపాలవుతుందని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని.
మరి ముఖ్యంగా యువత అజాగ్రత్త వాహనాలు నడపవద్దని కోరారు. పోలీస్ కళాబృందం సభ్యులు సామాజిక అంశాలపై ఆటపాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, ఎస్సై నవీన్ కుమార్, వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, పాండురంగ ప్రసాద్ భూపతిరావు మున్సిపల్ శివప్రసాద్ వెంకటేశ్వరరావు ఎల్లయ్య గోపయ్య కృష్ణ నాగార్జున ఈశ్వర చారి గురులింగం కానిస్టేబుల్ జానీ పాషా రవీందర్ నాయక్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa