వరంగల్ జిల్లా నర్సంపేట లో భారత దేశ మొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరమ్మ పై మరియు తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖబర్దార్, అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.
నర్సంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్ పటేల్ తో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి ఇందిర గాంధీ పై మరియు తన గానంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ని అమిత్ షా చెప్పులు మోసే బండి సంజయ్ విమర్శించడం హాస్యాస్పదంగా బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. లేనిపక్షంలో బండి సంజయ్ ని తెలంగాణ ప్రజానికం క్షమించదని కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇప్పటికైనా తన తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో బండి సంజయ్ నీ తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా యువజన కాంగ్రెస్ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి బండి సంజయ్ నీ క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రతిపాదించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ కి పద్మశ్రీ అవార్డును ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,యువకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa