ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి కట్టొద్దు.. స్థానికులు అభ్యంతరం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 07:27 PM

గోషామహల్‌ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించడంపై స్థానికులు, వ్యాపారులుతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలంలో ఆసుపత్రి నిర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి ఇప్పటికే తమ నియోజకవర్గంలో ఉందని, స్టేడియం మైదానంలో కొత్త భవనం నిర్మించే యోచనపై అభ్యంతరాలు తెలిపారు. ఆసుపత్రి స్టేడియంలో నిర్మించొద్దని ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నిర్మాణం వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడతాయని, భారీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే, వ్యాపారులు కూడా తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదిస్తున్నారు. వ్యర్థాల కారణంగా పరిసరాలు కలుషితమవుతాయని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa