రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన చేనేత పొదుపు పథకం కార్మికులకు వరం లాంటిదని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు అన్నారు. గురువారం స్థానిక చేనేత సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షులు వర్కల అశోక్ అధ్యక్షతన చేనేత కార్మికులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి అభయ హస్తం, నేతన్న పొదుపు, నేతన్న భద్రత, భరోసా వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
కార్మికులు ఈ పథకాలలో చేరేందుకు ముందుకు రావాలన్నారు. పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మికులకు వివరించారు. అనంతరం కార్మికులకు జియో ట్యాగ్ నెంబర్లు ఇవ్వాలని చేనేత సహకార సంఘం చైర్మన్ వర్కల అశోక్ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉన్ని సహకార సంఘం చైర్మన్ కృష్ణయ్య, జోలి శాఖ అధికారి లలిత, సంగం సభ్యులు రాజేందర్, కార్మికులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa