బెజ్జంకి మండలంలో గల ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చాలని రూరల్ సీఐ శ్రీను సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామానికి ఓ పోలీస్ అధికారిని నియమించి ఆయా గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చేందుకు గ్రామస్తులతో అవగాహన కల్పించవలసిన బాధ్యత ఆ అధికారిపై ఉందన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతపై తెలియజేస్తూ ఆయా గ్రామాల ప్రజలకు చైతన్య పరచాలన్నారు.
ఆయా గ్రామాల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు కిరాణా వర్తక వ్యాపారులు వారిలో చైతన్యం కలిగించే విధంగా మాట్లాడి సీసీ కెమెరాలు స్వతహాగా పెట్టుకోవాల్సిందిగా కోరాలన్నారు. ఆయా గ్రామాల్లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు గుడుంబా మరియు ఇతర అక్రమ వ్యాపారా లపై నిగా ఉండాలని సూచించారు. సిద్దిపేట రూరల్ సిఐ పరిధిలోని బెజ్జంకి మండలం సీసీ కెమెరాలు బిగించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని 30 రోజుల్లో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు బిగించే విధంగా కృషి చేయా లని పోలీసులకు కోరారు. ఈ సమావేశంలో బెజ్జంకి ఎస్సై కృష్ణారెడ్డి, ఏఎస్ఐ శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa