ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యా కేసులో నిందితులకు జీవిత ఖైదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 02:06 PM

వికారాబాద్ జిల్లా మార్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 27.12.2024 సంవత్సరం లో నమోదైన హత్యా నేరం లో నిందితులకు జీవిత ఖైదు  ఒక్కొకరికి  చొప్పున 1000 రూపాయల జరిమానా, నేరస్థులు ఒకవేళ 1000 రూపాయల జరిమానా కట్టకపోతే 6 నెలల సాధారణ జైలు శిక్ష  విదిస్తూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ  డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది అని జిల్లా ఎస్పీ శ్రీ కే.నారాయణ రెడ్డి గారు తెలిపినారు. అట్టి కేసుకు సంబందించిన వివరాలు క్రింది విదంగా ఉన్నాయి. 
తేది : 27.12.2014 నాడు ఘనపూర్  గ్రామం ,  మర్పల్లి మండలం కు చెందిన శ్రీమతి పట్లోల్ల సంగమ్మ భర్త లేట్ బస్వరాజ్, వృత్తి : కులీ , కులం: బలిజ నుండి ఫిర్యాదు అందినది ఏమనగా తన స్వగ్రామం ఘనపూర్ బ్రతుకుదెరువు కోసం  ఇస్నాపూర్ లోనివాసం ఉంటుంది . తేదీ 27.12.2014 నాడు తన బావ పట్లోల్ల మల్శెట్టి చనిపోవడం తో పిర్యాదురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలకు తన స్వగ్రామం ఘనపూర్ వచ్చింది. అంత్యక్రియల అనంతరం రాత్రి అందజ 9.30 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి ముందు మంట కాపుకుంటుండగా తన గ్రామస్తులైన పట్లోల్ల శ్రీను, మల్లేశం @ మల్లన్న పటేల్ , సలీం , శివయ్య పటేల్ లు గత సంవత్సరం అమృతం పటేల్ ను చంపిన విషయాన్ని మనుసులో ఉంచుకొని ఫిర్యాది ఇంటి దగ్గరకు వచ్చి పిర్యాదురాలి చిన్న కుమారుడైన పట్లోల్ల సురేష్ , వయస్సు 28
సంవత్సరములు ను ఇంట్లో నుంచి గుంజుకొని వచ్చి కత్తులతో , రాళ్ళతో దాడి చేసి కొట్టి చంపినారు అని ఫిర్యాదు రాగా అప్పటి మర్పల్లి  ఎస్‌ఐ  కే అరుణ్ కుమార్  కేసునమోదు చేయడం జరిగింది. అనంతరం అప్పటి మోమిన్ పేట్  సి‌ఐ ఏ వి రంగా  కేసును దర్యాప్తు చేసి గౌరవ కోర్ట్ నందు ఛార్జ్ షీట్ ను సమర్పించగా వాదోపవాదనలు విన్న గౌరవ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ  డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి  ఈ రోజు నిందితులు,  ఏ 1) పట్లోల్ల శ్రీనివాస్ , ఏ2) మల్లేశం @ మల్లన్న పటేల్ , ఏ3) సలీం, ఏ4) శివయ్య పటేల్ లకు  జీవిత ఖైదు మరియు ఒక్కొకరికి 1000 రూపాయల జరిమానా, నేరస్థులు ఒకవేళ 1000 రూపాయల జరిమానా కట్టకపోతే 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది అని జిల్లా ఎస్పీ  తెలిపారు.
ఇట్టి కేసులో నిందితునికి శిక్ష పడే విధంగా పని చేసిన పీపీ లు సుధాకర్ రెడ్డి, వి. రవి కుమార్, డీస్పీ వికారాబాద్, శ్రీ కే శ్రీనివాస్ రెడ్డి మొదటి ఐఓలు  అప్పటి మర్పల్లి  ఎస్ ఐ  అరుణ్ కుమార్ , రెండవ ఐఓ అప్పటి మోమిన్ పేట్  సి‌ఐ ఏ వి రంగా , ప్రస్తుత ఎస్ ఐ వి సురేష్ , ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ , అదనపు సీ డి ఓ లు జి.శ్రీశైలం, బ్రీఫింగ్ ఆఫీసర్ లు బి.వీరన్న, గార్లులను జిల్లా ఎస్పీ  అభినందించడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa