తెలంగాణ సర్కారుకు కేసీఆర్ ఫ్యామిలీ మరోసారి షాకిచ్చింది. కుల గణనలో పాల్గొనని వారికి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈరోజుతో రెండో దఫా కులగణన సర్వే ముగిసింది. ఈ 12 రోజుల్లో కేవలం 15 వేల కుటుంబాలే సర్వేలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. 2024 నవంబర్ 6న ప్రారంభించి డిసెంబర్ 25 వరకు 50 రోజుల పాటు సాగిన తొలి దఫా సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కటుంబాల(96.9 శాతం)ను సర్వే చేశామని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ఇంకా 3.1 శాతం (3,56,323) కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు. మిగిలిపోయిన వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అయితే మరోసారి అవకాశం కల్పించినా ఈ కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాల్గొనకపోవడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa