ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టులో నేడు విచారణకి వచ్చిన వామనరావు దంపతుల హత్య కేసు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 03:01 PM

తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వామనరావు దంపతుల హత్య కేసునకు సంబంధించిన వీడియోలతో సహా అన్ని పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021 ఫిబ్రవరి 27న న్యాయవాది గట్టు వామనరావు, నాగమణి దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.అన్ని పత్రాలను తమ ముందు ఉంచితే వాటిని పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో రికార్డులు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa