ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు.. రేపు తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 08:34 PM

 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా 2016లో యాసిన్ భత్కల్ సహా మరో ఐదుగురికి ఎస్‌ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ముద్దాయిలు కిందిస్థాయి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబు పేలుళ్ల కేసుపై మంగళవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందుల్లో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa