ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 11:53 AM

జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. 8 రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు జపాన్ వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం అధ్యయనం చేయనుంది. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వనించనున్నట్లు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa