ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 25న ఆకాశంలో అద్భుతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 04:36 PM

ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఈ అద్భుతం చోటుచేసుకోనుందట. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి చేరువగా రావడంతో ఆకాశంలో స్మైలీ ఇమేజ్ ఏర్పడనుందని తెలిపారు. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. శుక్రుడు, శని గ్రహాలు ప్రకాశవంతంగా మెరుస్తాయని, దీంతో ఎలాంటి పరికరాల అవసరం లేకుండా నేరుగానే ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు.టెలిస్కోప్, బైనాక్యులర్లతో చూస్తే మరింత క్లారిటీగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అద్భుత దృశ్యాన్ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామిర్ పేట, వరంగల్‌లో పాకాల సరస్సు లేదా భద్రకాళి ఆలయం ప్రాంతంలో వీక్షించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏపీలో అయితే ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రదేశాల వద్ద ఈ అద్భుతాన్ని చూడొచ్చని చెప్పారు. ఆర్ కె బీచ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వద్ద, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట సమీపంలోనూ చూడవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa