ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (ఓఎంసీ) కేసులో దోషులుగా తేలిన నలుగురు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో పాటు బీబీ శ్రీనివాస్రెడ్డి, రాజగోపాల్, అలీ ఖాన్లు నేడు ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.తమ పిటిషన్లలో, తమను దోషులుగా నిర్ధారించడానికి సీబీఐ కోర్టు తగిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో తాము మూడున్నరేళ్లకు పైగా జైలు జీవితం గడిపామని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో విచారణ సమయంలో తమకు బెయిల్ మంజూరైనప్పుడు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, కోర్టు విధించిన షరతులకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వారు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బెయిల్ మంజూరు చేస్తే, కోర్టు నిర్దేశించిన అన్ని నిబంధనలను తప్పకుండా పాటిస్తామని పిటిషనర్లు తమ అభ్యర్థనలో వివరించారు.
![]() |
![]() |