ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదర్శ నగర్ కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 02:33 PM

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదర్శ నగర్ కాలనీలోని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శ నగర్ కాలనీని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా ఈ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో నివసిస్తున్న పేదలకు అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa