సిద్దిపేట జిల్లా, నంగునూర్ మండలం, పాలమాకుల గ్రామంలో పండగ సాయన్న ముదిరాజ్, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ గారితో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకుని గుర్తించుకుంటున్నాం, మన ప్రముఖుల చరిత్రలు బయటకు వస్తున్నాయి. కృష్ణ స్వామి విగ్రహాలను హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో నలుమూలల ఏర్పాటు చేస్తున్నారు. ఆయన చరిత్ర చాలా గొప్పది. బలహీన వర్గాల కోసం ఆయన గ్రంథాల్ని రచించారు. ఆనాటి నిజాం కాలంలోనే గుర్తింపబడ్డారు.ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ1956 తరవాత మొదటి మేయర్ కృష్ణ స్వామి.ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. పండగ సాయన్న భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. పెద్దొన్ని కొట్టు పేదలకు పెట్టాలనే నినాదం తో ఆయన పని చేశాడు..ఆ కాలంలో పండగ సాయన్న అంటేనే హడల్.పండగ సాయన్న సమాజ శ్రేయస్సు కోసం పనిచేశాడు.కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడే కేవల్ కిషన్ జాతరను అధికారికంగా ప్రకటించీ నిధులు విడుదల చేశారు. కేసీఆర్ గారు చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వల్ల మన ముదిరాజ్ అధిక సంఖ్యలో ఉన్నారని తెలిసిందికేసీఆర్ గారి హయాంలోనే మత్సకారులకు వాహనాలు పంపిణీ చేశాం కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ లకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. హామీలు నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa