దేశీయంగా అధిక సామర్థ్యం గల విద్యుత్తు రైలింజన్ తయారైంది. 9,000 హార్స్పవర్ కలిగిన విద్యుత్తు రైలింజన్ను సీమెన్స్ తయారు చేయగా, ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 4,500 టన్నుల సరకును రవాణా చేసేందుకు ఇది ఉపయోగ పడుతుందని కంపెనీ చెబుతోంది. అంటే రోడ్లపై 100 కన్నా ఎక్కువ భారీ ట్రక్కుల్లో సరఫరా చేసే సరకును, ఈ ఒక్క ఇంజిన్ సాయంతో గూడ్స్లో తరలించొచ్చు. ఈ ఇంజిన్ గరిష్ఠవేగం 120 కిలోమీటర్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa