గట్టు మండలానికి కొత్త తహశీల్దార్గా నియమితులైన మదన్ మోహన్ గౌడ్ బుధవారం తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఇప్పటివరకు తహశీల్దార్గా ఉన్న సలీముద్దీన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ గౌడ్తో సంభాషిస్తూ ఆయన సేవలపై ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ మదన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. మండల ప్రజలకు లభించే పౌర సేవల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా చూడనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa