ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకంగా సుప్రీం కోర్టు సెట్, నకిలీ జడ్జి.. రూ.కోటిన్నర స్వాహా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:06 PM

పోలీసలు, ప్రభుత్వాలు ఎన్నిరకాలుగా ప్రచారం చేసినా సమాజంలో సైబర్ మోసాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.పైగా సైబర్ కేటుగాళ్లు జనాలను బురిడీ కొట్టించడం కోసం రోజుకో కొత్త ఐడియా అమలు చేస్తున్నారు. ఇన్నాళ్లపాటు ఓటీపీ, లింక్ మీద క్లిక్ చేయడం, ఆన్‌లైన్ ఆర్డర్, విదేశాల నుంచి బహుమతుల పేరుతో మోసం చేసేవారు. ఆ తర్వాత పోలీసులు, ఏసీబీ, సీబీఐ అధికారులమంటూ కొత్త రూట్ ఎంచుకున్నారు. ఇక చివరకు ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా వాడేశారు.


వీళ్ల వాడకం ఏ రేంజ్‌లో ఉందంటే.. ఏకంగా సుప్రీంకోర్టు సెట్ వేసి.. నకిలీ జడ్జీని కూర్చొబెట్టి.. ఫేక్ విచారణ చేసి.. అక్షరాల కోటిన్నర రూపాయలు కాజేశారు. పైగా ఈ కేటుగాళ్లు మోసం చేసింది.. సామాన్యులు, నిరాక్షరాస్యులను కాదు.. పదవీ విరమణ చేసిన ప్రభుత్వఅధికారిని. ఈ నయా చీటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ నయా మోసం హైదరాబాద్ వేదికగా వెలుగు చూసింది. సుప్రీంకోర్టు సెట్ వేసి.. లైవ్ విచారణ పేరు చెప్పి.. రిటైర్డ్ ఎంప్లాయ్ దగ్గర నుంచి కోటిన్నర రూపాయలు కాజేశారు. బాధితుడిని భయపెట్టడం కోసం ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి పేరునే వాడుకున్నారు. ఈ సంగటన వనస్థలిపురంలో వెలుగు చూసింది. సైబర్ కేటుగాళ్లు.. వనస్థలిపురంలో నివాసం ఉండే ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌ను టార్గెట్ చేసుకున్నారు. అతడి వివరాలు సేకరించారు. ఆ తర్వాత రంగంలోకి దిగారు.


దీనిలో భాగంగా సుప్రీంకోర్టు సెట్ వేశారు. జడ్జీ పేరుతో ఓ కేటుగాడు పరిచయం చేసుకున్నాడు. సదరు మాజీ ఉద్యోగి మీద తీవ్రమైన అభియోగాలు వచ్చాయని.. సుప్రీం కోర్టు వీటిని విచారిస్తుందని సదరు ఉద్యోగిని నమ్మించారు. జస్టిస్ కేసును స్వయంగా విచారిస్తున్నారని.. వీడియో కాల్‌లో విచారణలో పాల్గొనాలని బాధితుడిని బెదిరించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే నకిలీ జడ్జి నుంచి వీడియో కాల్ వచ్చింది. ఈ సందర్బంగా అతడు బాధితుడితో మాట్లాడుతూ.. మీ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసు తీవ్రంగా ఉందని.. అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు నకిలీ జడ్జి.


అంతేకాక ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు అకౌంట్లో డబ్బులు జమ చేయాలని.. కేసు విచారణ పూర్తయిన తర్వాత మీ డబ్బులను తిరిగి ఇస్తారని బాధితుడిని నమ్మించారు. అప్పటికే భయపడిపోయిన మాజీ ఉద్యోగి వీరి మాటలు నిజమే అని నమ్మాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. నిందితులు చేప్పిన బ్యాంక్ అకౌంట్‌లో రూ.1.50 కోట్లు జమ చేశాడు.


ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఎలాంటి కాల్ లేదు. తను చేసినా ఫోన్ కలవలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఎలా మోసపోయింది వివరిస్తూ ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఫైల్ చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa