ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా,,,ఎస్‌బీఐతో కుదిరిన ప్రభుత్వం ఒప్పందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:12 PM

విద్యుత్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఏకంగా వారికి కోటి రూపాయలు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే.. విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల వరకు ప్రమాద బీమా చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈమేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియతో రేవంత్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై ప్రకటన చేశారు. ఆవివరాలు..


తమ ప్రభుత్వం విద్యుత్ శాఖ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందన్నారు భట్టి విక్రమార్క. అంతకాక రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ ప్రాధాన్యత అధికంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగికి కీలక బాధ్యత ఉందన్నారు భట్టి.


రాష్ట్రానికి కావాల్సిన కరెంట్‌ని ఉత్పత్తిని చేయడంలో లైన్‌మెన్ నుంచి విద్యుత్ శాఖ మంత్రి వరకు బాధత్య వహిస్తారని.. అందుకే వీరంతా కలిసికట్టుగా పని చేయాలని భట్టి పిలుపునిచ్చారు.విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి మరి పని చేస్తుంటారని తెలిపారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఎంతో భయపడుతుంటారని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ధైర్యం, నమ్మకం కలిగించేందుకు సిబ్బందికి రూ.కోటి ప్రమాద బీమ కల్పించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.


భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిందన్నారు. మరో నాలుగేళ్లలో అనగా..2029-30 వరకు.. రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.


ఇక గత నెలలో అనగా మే చివరి వారంలో తెలంగాణ ప్రభుత్వం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ శాఖ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా మొత్తం కోటి రూపాయలను అందించిన సంగతి తెలసిందే. ఎన్‌పీడీసీఎల్ పరిధిలో విధి నిర్వహణలో చనిపోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.అలానే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మరో కార్మికుడు రమేశ్ భానకచరి కారుణ్య నియామక ఉత్తర్వులను కూడా అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa