తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సోమవారం ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, రాగల రోజుల్లో వర్ష ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
మంగళవారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వాతావరణ శాఖ సూచనల మేరకు, ఈ ఐదు రోజుల పాటు తెలంగాణవాసులు వర్షాలకు సంబంధించిన హెచ్చరికలను పాటించాలని అధికారులు కోరారు. ఈదురు గాలులు, మెరుపుల వల్ల ప్రమాదం పొంచి ఉండటంతో, బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, తక్కువ దృశ్యమానత, రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa