వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య తెలంగాణ రాష్ట్రానికి 2,800 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించాలని పార్లమెంట్లో ప్రశ్నించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ రక్షణను ప్రోత్సహిస్తాయని, అలాగే తెలంగాణ రవాణా రంగానికి నూతన శక్తిని అందిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ పథకం రాష్ట్రంలో స్థిరమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ప్రశ్నకు స్పందిస్తూ, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, కేంద్రం ప్రస్తుతం ప్రామాణిక GCC (Gross Cost Contract) మోడల్ను మాత్రమే ఆమోదిస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ పథకంలో భాగం కానందున, ఇది ఇంకా పరిశీలనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ హైబ్రిడ్ మోడల్పై కేంద్రం మరింత సమీక్ష చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకం ఆమోదం పొందితే, తెలంగాణలో రవాణా రంగంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కాలుష్య రహిత రవాణా సేవలు అందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. ఈ ప్రతిపాదనపై కేంద్రం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa