ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల్లో చిక్కుకున్న బాధితులతో ఫోన్లో మాట్లాడిన మైనంపల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 06:51 PM

మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. హావేలిఘనపూర్ మండలం రాజీపేట తండా దగ్గర వరదలో 10 మంది చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వాతావరణం అనుకూలించగానే సహాయం అందించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారని, అధైర్యపడొద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa