ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలియుగ దైవం గోవిందుడి ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి : నీలం మధు ముదిరాజ్..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:33 AM

ఏడుకొండల వాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుడి కృపాకటక్షాలు ప్రజలందరిపై ఉండాలి అని ఆ దేవదేవుడిని ప్రార్దించినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారి అర్చన సేవలో పాల్గొని ఆ గోవిందుడిని దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై నిమిషాల పాటు స్వామివారిని ఏడవ ద్వారం లోపల కూర్చొని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని అన్నారు, దర్శన అనంతరం ఆలయ అర్చకులచే రంగనాయక మండపం వద్ద వేద ఆశీర్వచనం అందుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు,ఆ శ్రీనివాసుని ఆశీషులతో సమస్త మానవాళి బాగుండాలి అని తెలిపారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa