ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు నో చికెన్, మటన్.. ఈ రోజే షాపుల ముందు జనం క్యూ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 12:16 PM

తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మటన్, చికెన్, మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో, మటన్, చికెన్ షాపులు మూసివేయనున్న నేపథ్యంలో.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ముందురోజు నుంచే (బుధవారం) పండుగ సందడిని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఉదయం నుంచే క్యూ కట్టారు. సెప్టెంబర్ 29న రూ. 278.66 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంగళవారం కూడా రూ. 300 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. వరుస సెలవులు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa