తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి పథకం' ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే.. వాటిని ఉపయోగించి మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది. ఢిల్లీలో 'సహేలీ' పేరుతో మహిళలకు స్మార్ట్ కార్డులను అందించారు. ఈ తరహాలో 2026 ప్రారంభంలో తెలంగాణలోనూ అందుబాటులోకి తేవాలని RTC యోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa