సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగను నిర్వహిస్తోంది. రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 13 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, 16, 17న గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల మహిళలు తయారు చేసిన మిఠాయిలతో పాటు చేనేత, హస్తకళల స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa