ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో 32 వేల మంది రైతులు పీఎం కిసాన్ అనర్హుల గుర్తింపు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 03:40 PM

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద అనర్హులకు నిధులు అందాయని అధికారులు గుర్తించారు. ఈ పథకం నిబంధనలను అతిక్రమించి, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు, భూమిని విక్రయించినవారు వంటి 32 వేల మంది రైతులు తెలంగాణలో కేంద్రం నుంచి సాయం పొందినట్లు గుర్తించారు. వీరి ఖాతాల్లోకి వెళ్లిన నిధులను కట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. 2018-19లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 21 విడతల్లో రూ.14,237.05 కోట్లను అర్హులైన రైతులకు జమ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa