ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు కోరారు. ఆదివారం కాకినాడ రూరల్ నేమాం, పండూరు, తిమ్మాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు సుధాకర్, ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మిత్రిమూర్తులు, కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, కర్రి వెంకట్రాజు, నందిపాటి రమణ, పోసిన రాము, దాసరి శివ, రాందేవు సీతయ్యదొర పాల్గొన్నారు.
![]() |
![]() |